Sunday, November 25, 2007

నాలుగో తెలుగు వెన్నెల


మొదటి పోస్ట్ ఏం వ్రాద్దామా అని ఎక్కువగా ఆలోచించే అవసరం లేకుండా , నవంబర్ 18 న జరిగిన నాలుగో తెలుగు వెన్నెల గురించే సరదాగ మరోసారి గుర్తు చేసుకుందాం అనిపించింది.

గడచిన మూడు సమావేశాలకంటే ఈసారి కొంత విభిన్నంగా జాగ్స్ మాష్టారు (Prof. Jagadeeswaran Pudur) మిత్రులందరితో తేటగీతి పద్యాన్ని నిర్మించడం ఎలా అని సాధన చేయించడం బాగుంది.

జాగ్స్ గారు 1, 2 అంకెల్తో ఇంద్ర,సూర్య గణాల్ని బోర్డ్ మీద చూపిస్తుంటే అప్పుడెప్పుడో బళ్ళో Binary System గురించి చదువుకున్న విషయం గుర్తుకొచ్చింది.

MVL ప్రసాద్ గారు, ప్రసాద్ తోటకూర గారు చెలరేగిపోతున్నారు... పద్య పాదాల్ని గబగబా వ్రాసేస్తున్నారు !
బహుశా జాగ్స్ గారితో చాటుగా జరిగే ఘాటయిన చాటుపద్య సమావేశపు ప్రభావమేమో !

ఆళ్ళ శ్రీనివాసుడు ఈసారి ఏదో "గుండె కోత" లో బిజీగా ఉన్నట్లున్నారు ! పులిగండ్ల వారు ఈ మధ్య బొత్తిగా ఆకుచాటు పిందె లాగ తయారయ్యారు. అయ్యా ! తమరు కనబడాలి అప్పుడప్పూడూ !

ఈ నెల తెలుగు వెన్నెలకు కొసమెరుపు ఏమిటంటే, గత కొద్దివారాలుగా, తన ఆంగ్లవిద్యా పాండిత్యంతో, లేఖా సాహిత్యంలో (అంటే E-mail literature అని చదువుకోగలరు) "బందరు" సముద్ర తీరంలో కార్తీక "చంద్రు"డిలా ప్రకాశిస్తున్న మిత్రుడొకరు సమావేశానికి రావడం !

మిత్రులంతా కాచుకోండి ! ముందుంది మొసళ్ళ పండగ !!

No comments: