Wednesday, November 28, 2007

రెండో తెలుగు వెన్నెల

ఇహ రెండో తెలుగు వెన్నెల సెప్టెంబరు 16, 2007 న అవర్ ప్లేస్ ఇండియన్ రెస్టారెంట్లో జరిగింది. ముఖ్య అతిధి ప్రొఫెసరు వేదాల శ్రీనివాసాచార్యులు గారు. ఓక్లహోమా సెంట్రల్ యూనివర్సిటీ లో వేదాంత,సంస్కృతాచార్యులుగా ప్రసిధ్ధులయిన వేదాల గారు ఓక్లహోమా హిందూ దేవాలయంలో అర్చకత్వం కూడా చేస్తారు.

ఇదే కార్యక్రమానికి ఇంకో విశిష్ట అతిధి న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ చివుకుల ఉపేంద్ర గారు.

వేదాల గారు నన్నయాదుల కాలం నుండి 20 వ శతాబ్దం దాకా తెలుగు సాహిత్య పరిణామక్రమాన్ని వివరించారు.పోతన భాగవత విశేషాల్ని వర్ణించారు. రసరమ్యంగా గజేంద్రమోక్షఘట్ట పద్యాల్ని పాడి వినిపించారు.ఉపేంద్ర గారు తెలుగు భాషని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతని వివరించారు.

మిత్రులు జువ్వాది రమణ కొన్ని పద్యాల్ని చదివి వినిపించగా, చంద్ర కన్నెగంటి వ్రాసిన "వాన వెలసిన సాయంత్రం" కవితా సంకలనం నుండి ఒక కవితను నందివాడ ఉదయభాస్కర్ చదివి వినిపించారు.

ఈ సమావేశం తాలూకు మరిన్ని వివరాలు ఈ లింకుల్లో చూడండి.

http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2007/sep/18new16

http://www.idlebrain.com/community/etc/tantex-sahitya1.html

No comments: