ఒకటే రోజు రెండువార్తలు చదివాను.ఆలోచనల్ని వికలం చేసే వార్తలు.
మొదటిది సాక్షాత్తూ ఒక రాష్ట్రమంత్రివర్యులు మజ్లిస్ శాసనసభ్యుల ముందస్తు అనుమతి లేకుండా పాతబస్తీలో ఆకస్మిక తనిఖీలకి వెళ్ళినందుకు మజ్లిస్ కి కోపం రావడం--దానికి సంజాయిషీగా మంత్రి కాసు కృష్ణారెడ్డి అసదుద్దీన్ ఒవైసీ కార్యాలయానికి వెళ్ళి క్షమాపణలు అడగడం !
రాష్ట్రప్రజలకి ప్రాతినిధ్యం వహించే ఒక మంత్రికే దిక్కులేకపొతే ఇక మామూలు ప్రజలకి పాతబస్తీలో నోరు తెరిచే అవకాశం ఉంటుందా ? అన్ని హంగులతో, బందోబస్తుతో వెడలిన మంత్రిగారే మజ్లిస్ కార్యకర్తలు నిలేస్తే జావగారిపొయారంటే అక్కడ నడుస్తున్నది ప్రభుత్వమా లేకుంటే ఒవైసిమార్క్ గూండాయిజమా ?
ఇక రెండో వార్త -- ఒక వాటర్ బోర్డ్ అధికారి "పాతబస్తీలో పనిచేస్తున్నా, నాకు పాకిస్తాన్ లో ఉన్నట్లుగా ఉంది. నా పని నేను చేసుకుపోలేని పరిస్థితి. ఇక్కడసలు చట్టం అమలు అవుతుందా అని అనుమానం వేస్తుంది. నన్ను బదిలీ చేయండి ప్రభో " అని ఉన్నతాధికారులకి మొరపెట్టుకున్నారని దినపత్రికల్లో వచ్చింది.
పాతబస్తీలో మజ్లిస్ గూండాలు చెప్పిందే వేదమా ? ప్రభుత్వచట్టాల్ని అమలు చేసే దమ్ములు ఎవరికీ లేవా ?పరిపాలనాకేంద్రమయిన రాష్ట్ర రాజధానిలోనే ఒక ప్రాంతంలో వాటర్ బిల్లులు,కరెంట్ బిల్లులు,ఇంటిపన్నులు వసూలు చేయలేకపోతే నిజంగా రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందా అన్న అనుమానం వస్తున్నది.
సమస్య మైనారిటీలకి సంబంధించింది కాదు. పాతబస్తీలో హిందువులయినా, ముస్లింలయినా ఇదే పరిస్థితి.కూలీనాలీ చేసుకుని పొట్టబోసుకునే బడుగుజీవులు ముస్లిములయినా, హిందువులయినా మజ్లిస్ కి వ్యతిరేకంగా నోరెత్తే సాహసం చేయలేరు.ముషారఫ్ పాలిస్తున్న పాకిస్తాన్ కి ఏ మాత్రం తీసిపోని వారసత్వ నియంతృత్వ సామ్రాజ్యం నడుపుతూ దానికి మైనారిటీల హక్కులు అనే ముసుగు తగిలించి బతుకుతున్న ఈ పరాన్నభుక్కులు వై.యెస్ ప్రభుత్వం వచ్చాక పేట్రేగిపోవడం ఎక్కువయింది.
ముస్లిం సోదరులకి సహాయం చేయడం అంటే మజ్లిస్ ని పెంచిపోషించడం కాదు అని రాజశేఖరునికి తెలియని రాజనీతి కాదు.కాకుంటే ఓటుబ్యాంకు రాజకీయాల్లో పడిపోయి, రానున్న ప్రమాదాన్ని గుర్తించి కూడా విస్మరిస్తున్నారు.అంతే. మావోయిస్టుల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చిచంపిన ఈ ప్రభుత్వం, మజ్లిస్ గూండాయిజం కి వ్యతిరేకంగా ఏ చర్యా తీసుకోలేకపోవడం సిగ్గుచేటు.
Friday, February 1, 2008
Wednesday, January 30, 2008
మోహన్ బాబు -- ఆవు
మిత్రుడొకరు మోహన్ బాబు మీద పోస్ట్ చదివి "ఆవుమీద వ్యాసం" అంటే ఏమిటండీ అని ఫోన్ చేశారు. ఆయనకి వివరం చెప్పాను.స్కూలుపిల్లాడొకడు పరీక్షకెళ్తూ ఒకేఒక్క వ్యాసం చదువుకుని వెళ్ళాడట.అది ఆవు గురించి.తీరా పరీక్షలో విమానం మీద,రైలు మీదా వ్యాసం రాయమని అడిగారట. మనవాడికి ఆవు ఒక్కటే తెలుసు.ఇక వ్యాసపరంపర ఇలా సాగింది."విమానం గాలిలొ ఎగురుతుంది.దానికి రెక్కలుంటాయి.పైకి ఎగిరాక కిందకి చూస్తే పచ్చిక బయళ్ళు కనబడ్తాయి. అక్కడ గడ్డిమేస్తూ ఆవులుంటాయి. ఆవు సాధుజంతువు. దానికి రెండు కొమ్ములుంటాయి.నాలుగు కాళ్ళుంటాయి.ఆవు పాలిస్తుంది. పేడ వేస్తుంది...." ఇలా మొత్తం ఆవుగురించే రాసేశాడు.
ఇక రైలు గురించి మొదలెట్టి " రైలు పట్టాల మీద నడుస్తుంది.దాని ఇంజన్ వెనక పెట్టెలుంటాయి. అందులో ఎక్కి వెళ్తుంటే పట్టాల పక్కన గడ్డిమేస్తూ ఆవులుంటాయి. ఆవు సాధుజంతువు. దానికి రెండు కొమ్ములుంటాయి.నాలుగు కాళ్ళుంటాయి.ఆవు పాలిస్తుంది. పేడ వేస్తుంది...." మళ్ళీ ఇదే సోది..ఎందుకంటే వాడికొచ్చింది అదొక్కటే గనుక. ఈవిధంగా తిరిగి తిరిగి మొదటికే వచ్చే జీడిపాకాన్ని "ఆవుమీద వ్యాసం" అని చిన్నప్పుడు నవ్వుకునేవాళ్ళం.
ఇలా "ఆవుమీద వ్యాసం" మేధావుల వర్గంలో ప్రసిద్ధులయిన సినిమా వ్యక్తులు దాసరి నారాయణ రావు, ఆయన శిష్యుడు మోహన్ బాబు.
మోహన్ బాబు తీరు ఎలా ఉంటుందంటే....ఈ కింది ప్రస్తావనలు తప్పనిసరిగా ఉంటాయి.
1. అన్నయ్య (NTR)
2. మా గురువుగారు దాసరి
3. మా విష్ణు బాబు, మా మనోజ్ బాబు
4. మా పాప లక్ష్మీప్రసన్న
5. విద్యానికేతన్ కాలేజ్
6. ప్రజలే దేవుళ్ళు.
7. బాబా ఆశీస్సులు
ఒక కాలేజ్ వార్షికోత్సవంలో ఇలా ఉంటుంది ఆయన "ఆవుమీద వ్యాసం"
"ఈ కాలేజ్ పిల్లల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అన్నయ్యతో కలిసి 1995లో మేజర్ చంద్రకాంత్ షూటింగ్ సందర్భంగా ఫలానా కాలేజ్ కి వెళ్ళిన సంఘటన గుర్తొస్తున్నది. ఆ రోజే మా గురువుగారు దాసరిగారు కూడా ఇంకో ఫలనా కాలేజ్ లో షూటింగ్ కి వెళ్ళారు.మా విష్ణుబాబుని కూడా ఇదే కాలేజ్ లో చేర్పించి IPS చేయించాలి అనుకున్నాను. కానీ అభిమానుల (?) కోరికమేరకు సినిమాల్లోకి తెచ్చాను.మరి పాప లక్ష్మీప్రసన్న కూడా అమెరికాలో ఫలానా కోర్సు చేసింది.ఈ కాలేజ్ కూడా అచ్చం మా విద్యానికేతన్ కాలేజ్ లా ఉంది.అక్కడ 2 వేలమందికి చదువు చెబ్తున్నాం. అడ్మిషన్ ఫాంలో కులం పేరు అడగని ఏకైక కాలేజ్ మాదే. మరి దీన్ని లెజెండ్ అనరా ? ప్రజలే దేవుళ్ళు.వాళ్ళు చూస్తున్నారు.బాబా ఆశీస్సులు నాకు,నా కుటుంబానికి కావాలి. ఇక్కడున్న పిల్లలంతా నాలాగే మంచివాళ్ళు. మేము ఎవరికీ హాని చేసేవాళ్ళం కాదు. ఒకరిగురించి చెడుగా తలిచేవాళ్ళం కాదు... "
ఇంతవరకు ఏ తానా సభలకిగాని,ఆటా సభలకిగానీ ఆహ్వానం అందినట్లు లేదుగానీ, ఒకవేళ వస్తే గిస్తే ఆయన "ఆవుమీద వ్యాసం" ఇలా ఉంటుంది....
"ఇంతమంది ప్రవాసాంధ్రుల్ని చూస్తుంటే అన్నయ్య చెప్పినట్లుగా చేయెత్తి జైకొట్టు తెలుగోడా అనాలనిపిస్తుంది. మా గురువు దాసరి గారు ఇదేమాట అన్నారు. మీరంతా నాలాగే క్రమశిక్షణతో కష్టపడి పైకొచ్చినవాళ్ళు. మనం ఎవరికీ హాని చేసేవాళ్ళం కాదు. ఒకరిగురించి చెడుగా తలిచేవాళ్ళం కాదు.అసలు మా మనోజ్ బాబు అమెరికా వెళ్ళి IPS అవుతా నాన్నా అని అడిగాడు.కానీ, మళ్ళీ అభిమానుల వత్తిడికి తలొంచి సినీకళామతల్లికి నా జంటసింహాలను అంకితం చేశాను.మరి దీన్ని లెజెండ్ అనరా ? ఇక్కడ ఉన్న కొందరు NRIలు నన్ను అడిగారు. వాళ్ళ పిల్లలకి క్రమశిక్షణ నేర్పమని. మీ పిల్లల్ని హార్వర్డ్,స్టాన్ ఫర్డ్ లాంటి చోట్లకి కాకుండా మా విద్యానికేతన్ కి పంపండి అని చెప్పాను.ఏది ఏమయినా బాబా ఆశీస్సులు నాకు,నా కుటుంబానికి కావాలి......."
ఇదీ ఆయన వరస !
అది పరామర్శ అయినా, సంతాపం అయినా, వివాహం అయినా, రమ్యక్రిష్ణతో ఇంటర్వ్యూ అయినా..అన్నిటికీ మోహన్ బాబు గారిది ఒకటే మంత్రం !
ఇలా "ఆవుమీద వ్యాసం" మేధావుల వర్గంలో ఇద్దరు రాజకీయులు కూడా ఉన్నారు. ఎవరో ఊహించండి. వారిగురించి తదుపరి పోస్ట్ లో రాస్తా.
ఇక రైలు గురించి మొదలెట్టి " రైలు పట్టాల మీద నడుస్తుంది.దాని ఇంజన్ వెనక పెట్టెలుంటాయి. అందులో ఎక్కి వెళ్తుంటే పట్టాల పక్కన గడ్డిమేస్తూ ఆవులుంటాయి. ఆవు సాధుజంతువు. దానికి రెండు కొమ్ములుంటాయి.నాలుగు కాళ్ళుంటాయి.ఆవు పాలిస్తుంది. పేడ వేస్తుంది...." మళ్ళీ ఇదే సోది..ఎందుకంటే వాడికొచ్చింది అదొక్కటే గనుక. ఈవిధంగా తిరిగి తిరిగి మొదటికే వచ్చే జీడిపాకాన్ని "ఆవుమీద వ్యాసం" అని చిన్నప్పుడు నవ్వుకునేవాళ్ళం.
ఇలా "ఆవుమీద వ్యాసం" మేధావుల వర్గంలో ప్రసిద్ధులయిన సినిమా వ్యక్తులు దాసరి నారాయణ రావు, ఆయన శిష్యుడు మోహన్ బాబు.
మోహన్ బాబు తీరు ఎలా ఉంటుందంటే....ఈ కింది ప్రస్తావనలు తప్పనిసరిగా ఉంటాయి.
1. అన్నయ్య (NTR)
2. మా గురువుగారు దాసరి
3. మా విష్ణు బాబు, మా మనోజ్ బాబు
4. మా పాప లక్ష్మీప్రసన్న
5. విద్యానికేతన్ కాలేజ్
6. ప్రజలే దేవుళ్ళు.
7. బాబా ఆశీస్సులు
ఒక కాలేజ్ వార్షికోత్సవంలో ఇలా ఉంటుంది ఆయన "ఆవుమీద వ్యాసం"
"ఈ కాలేజ్ పిల్లల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అన్నయ్యతో కలిసి 1995లో మేజర్ చంద్రకాంత్ షూటింగ్ సందర్భంగా ఫలానా కాలేజ్ కి వెళ్ళిన సంఘటన గుర్తొస్తున్నది. ఆ రోజే మా గురువుగారు దాసరిగారు కూడా ఇంకో ఫలనా కాలేజ్ లో షూటింగ్ కి వెళ్ళారు.మా విష్ణుబాబుని కూడా ఇదే కాలేజ్ లో చేర్పించి IPS చేయించాలి అనుకున్నాను. కానీ అభిమానుల (?) కోరికమేరకు సినిమాల్లోకి తెచ్చాను.మరి పాప లక్ష్మీప్రసన్న కూడా అమెరికాలో ఫలానా కోర్సు చేసింది.ఈ కాలేజ్ కూడా అచ్చం మా విద్యానికేతన్ కాలేజ్ లా ఉంది.అక్కడ 2 వేలమందికి చదువు చెబ్తున్నాం. అడ్మిషన్ ఫాంలో కులం పేరు అడగని ఏకైక కాలేజ్ మాదే. మరి దీన్ని లెజెండ్ అనరా ? ప్రజలే దేవుళ్ళు.వాళ్ళు చూస్తున్నారు.బాబా ఆశీస్సులు నాకు,నా కుటుంబానికి కావాలి. ఇక్కడున్న పిల్లలంతా నాలాగే మంచివాళ్ళు. మేము ఎవరికీ హాని చేసేవాళ్ళం కాదు. ఒకరిగురించి చెడుగా తలిచేవాళ్ళం కాదు... "
ఇంతవరకు ఏ తానా సభలకిగాని,ఆటా సభలకిగానీ ఆహ్వానం అందినట్లు లేదుగానీ, ఒకవేళ వస్తే గిస్తే ఆయన "ఆవుమీద వ్యాసం" ఇలా ఉంటుంది....
"ఇంతమంది ప్రవాసాంధ్రుల్ని చూస్తుంటే అన్నయ్య చెప్పినట్లుగా చేయెత్తి జైకొట్టు తెలుగోడా అనాలనిపిస్తుంది. మా గురువు దాసరి గారు ఇదేమాట అన్నారు. మీరంతా నాలాగే క్రమశిక్షణతో కష్టపడి పైకొచ్చినవాళ్ళు. మనం ఎవరికీ హాని చేసేవాళ్ళం కాదు. ఒకరిగురించి చెడుగా తలిచేవాళ్ళం కాదు.అసలు మా మనోజ్ బాబు అమెరికా వెళ్ళి IPS అవుతా నాన్నా అని అడిగాడు.కానీ, మళ్ళీ అభిమానుల వత్తిడికి తలొంచి సినీకళామతల్లికి నా జంటసింహాలను అంకితం చేశాను.మరి దీన్ని లెజెండ్ అనరా ? ఇక్కడ ఉన్న కొందరు NRIలు నన్ను అడిగారు. వాళ్ళ పిల్లలకి క్రమశిక్షణ నేర్పమని. మీ పిల్లల్ని హార్వర్డ్,స్టాన్ ఫర్డ్ లాంటి చోట్లకి కాకుండా మా విద్యానికేతన్ కి పంపండి అని చెప్పాను.ఏది ఏమయినా బాబా ఆశీస్సులు నాకు,నా కుటుంబానికి కావాలి......."
ఇదీ ఆయన వరస !
అది పరామర్శ అయినా, సంతాపం అయినా, వివాహం అయినా, రమ్యక్రిష్ణతో ఇంటర్వ్యూ అయినా..అన్నిటికీ మోహన్ బాబు గారిది ఒకటే మంత్రం !
ఇలా "ఆవుమీద వ్యాసం" మేధావుల వర్గంలో ఇద్దరు రాజకీయులు కూడా ఉన్నారు. ఎవరో ఊహించండి. వారిగురించి తదుపరి పోస్ట్ లో రాస్తా.
Monday, January 28, 2008
మారెప్పని కొడ్తారా ఇప్పుడు ?
సందట్లో సడేమియా-పార్ట్ 2 మొదలయింది. ఈసారి మాటలు విసిరింది మంత్రి మారెప్ప. ఇందుగలడందులేడను సందేహం లేకుండా అన్ని టాపిక్స్ మీదా అనర్గళంగా కామెంట్లు విసురుతున్న మంత్రిగారు పవన్ కళ్యాణ్ రివాల్వర్ తిప్పుడు,మొదటిభార్యతో విడాకుల అంశం మీద తన సహజశైలిలో మాట్లాడారు.
ఇప్పుడు రిజిష్టర్డ్ మరియు అన్-రిజిష్టర్డ్ ఫాన్స్ ఎలా "మనస్తాపం" చెందుతారో చూడాలి :-)
మారెప్ప మాత్రం రాజశేఖర్ కాదు.ఇంకో బలమయిన రాజశేఖర్ అండదండలతో, ఆశీస్సులతో రోజుకోరకంగా విజృంభిసున్నవాడు ! పైగా దళితవర్గానికి చెందిన మంత్రి ! ఆంధ్రప్రదేశ్ లో ఏ సందుకయినా సిధ్ధమే అని ఇంద్ర సినిమా డైలాగుల్లాగా సవాళ్ళు విసురుతున్నాడు అసలే !
ఇప్పుడు రిజిష్టర్డ్ మరియు అన్-రిజిష్టర్డ్ ఫాన్స్ ఎలా "మనస్తాపం" చెందుతారో చూడాలి :-)
మారెప్ప మాత్రం రాజశేఖర్ కాదు.ఇంకో బలమయిన రాజశేఖర్ అండదండలతో, ఆశీస్సులతో రోజుకోరకంగా విజృంభిసున్నవాడు ! పైగా దళితవర్గానికి చెందిన మంత్రి ! ఆంధ్రప్రదేశ్ లో ఏ సందుకయినా సిధ్ధమే అని ఇంద్ర సినిమా డైలాగుల్లాగా సవాళ్ళు విసురుతున్నాడు అసలే !
మోహన్ బాబు సందట్లో సడేమియా
సినీనటుడు రాజశేఖర్ చిరంజీవికి రాజకీయానుభవం లేదని భీమవరంలో వ్యాఖ్యలు చేశారట. దానికి కోపగించి చిరు అభిమానులుగా చెప్పుకున్న కొందరు, పిల్లలతో వెళ్తున్న రాజశేఖర్ కుటుంబం పైన దాడి చేసి (పిల్లల్ని) గాయపరిచిన విషయం ఈ రోజు వేడి వార్త.
మీలో ఈ వార్త ఇంకా ఎవరికయినా తెలియకపోతే మెరుగయిన సమాజం కోసం రోజుకి 25 గంటలు తపించే ఒక ఛానెల్ని సంప్రదించండి.
రాజశేఖర్ గారివి వ్యక్తిగత వ్యాఖ్యలు.తన అభిప్రాయాన్ని వెలిబుచ్చే హక్కు ఆయనకుంది. అభిప్రాయాల్ని వెలిబుచ్చినందుకు ఆయన మీద, పసిపిల్లల మీద దాడి చేయడం అమానుషం.ఖండించాల్సిన అంశం.అదే సమయంలో రాజశేఖర్ కూడా ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది. అసలు చిరంజీవిగారు తనంతట తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేదు ఇంతవరకూ. ఆయన చెప్పకుండానే, వస్తాడో రాడో తెలియకుండానే, మనకి అభిప్రాయం వెలిబుచ్చే హక్కు ఉంది గదా అని, ఆయనకి రాజకీయానుభవం లేదని కామెంట్ చేసి వివాదాన్ని కొనితెచ్చుకోడం ఎందుకు ?
దాడి జరిగిందని తెలిసి చిరంజీవి రాజశేఖర్ ఇంటికెళ్ళి పరామర్శించి, క్షమాపణలు తెలియజేయడం చాల సంస్కారవంతంగా ఉంది.
కానీ ఆయన ఆ ప్రెస్ మీట్లో కొన్ని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. సంఘటనని బహిరంగంగా ఖండించదల్చుకుంటే ఆ పని ఎలాంటి శషభిషలు లేకుండా చేయాలి. "అభిమానులు మనస్తాపం చెంది ఉంటారు...హర్ట్ అయి ఉంటారు. కానీ వాళ్ళ ఆవేశం కంట్రోల్ చేసుకోవాలి".. ఏమిటీ సోది ?
రాజకీయాల్లోకి రావడానికి,అధికారం అందుకోడానికి రాజకీయానుభవం అనేది ప్రాతిపదిక కాదు.ఎన్.టి.రామారావ్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఈ విమర్శ వచ్చింది. దానికి సమాధానం జనమే తేల్చి చెప్పారు.ఎన్టీయార్ కయినా,రాజీవుడికయినా, సోనియాకయినా, చిరంజీవికయినా ఆ విమర్శ అక్షరాలా వర్తిస్తుంది. దానికి దురభిమానులు ఆవేశపడాల్సింది ఏంలేదు.రాజశేఖర్ మాట్లాడింది సత్యమే అంటూనే, దానికి అభిమనులు మనస్తాపం చెంది ఉంటారు అని ఈయనే చెప్పడం ఏంటి ? ఇప్పటిదాకా ఇదెవరో దురభిమానులు చేసింది అని అనుకుని ఖండించవచ్చు. చిరంజీవి ఇలా చెబ్తే, ఓహో మేము కూడా మనస్తాపం చెందాలి కాబోలు అని మామూలు అభిమానులు కూడా ఆవేశపడే ప్రమాదం ఉంది.రేపొద్దున్న ఇంకెవరన్నా ఏదన్నా అంటే మళ్ళీ ఇదే డ్రామా మొదలు.
నాగబాబు వచ్చి వాళ్ళు రిజిష్టర్డ్ ఫాన్స్ కాదు...అన్-రిజిష్టర్డ్ ఫాన్స్ అంటాడు. అదేదో కావాలని ఎవరో చేసినట్లుగా . దుండగులో, చిరంజీవికి చెడ్డపేరు తెచ్చే కుట్రో అయితే ముసుగులు వేస్కుని ఆ పని చేసేవాళ్ళు. ఇలా బహిరంగంగా, తమ కూడా వీడియో కెమెరాలు తెచ్చుకుని, దాడిని చిత్రీకరించి, మళ్ళీ ఆ క్యాసెట్ ని టివి ఛానెల్స్ కి పంపి ఉండేవాళ్ళు కాదు.
ఇహ వెంటనే పరామర్శల పర్వం మొదలయింది. ఆ సందట్లో అసలయిన సడేమియా మోహన్ బాబు గారిది. ఆయన గురువుగారికిమల్లే (దాసరి)ఈయన సగం శ్లేషతో,సగం వ్యంగ్యంతో, సగం మన కాల్పనిక,ఊహాశక్తికి వదిలేస్తూ మాట్లాడ్డం ! రాజశేఖర్ కూడా సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబిలీ సినిమాలు తీశాడు అంటాడు. ఇక్కడెవరూ పిరికివాళ్ళు లేరు, అసమర్ధులు లేరు అంటాడు. అసలు దానిగురించి ఇప్పుడెందుకు ? ఎవర్ని రెచ్చగొడ్తున్నాడో అర్ధం కాదు. ఎవరు చేయించారో ప్రజలకే తెలుసు అంటాడు. చిరంజీవి చేయించాడేమో అన్న అర్ధం రావాలనేమో ! ఇక అసలు పరామర్శకి వచ్చాను అనే విషయం వదిలేసి ఆయన మంచితనం గురించి,ఆయన కుటుంబం గురించి స్వోత్కర్ష ! రాజశేఖర్తో కలిపేసుకుని నేను చాలా మంచోడ్ని అని సొంతడబ్బా..ఏ సంఘటన జరిగినా, ఏ సందర్భంలో అయినా ఆవు మీద వ్యాసం రాసినట్లుగా మాట్లాడగల సమర్ధుడు మోహన్ బాబు !
ఈ కామెడీ ఇంకా కొనసాగబోతోంది! వేచి చూడండి !
మీలో ఈ వార్త ఇంకా ఎవరికయినా తెలియకపోతే మెరుగయిన సమాజం కోసం రోజుకి 25 గంటలు తపించే ఒక ఛానెల్ని సంప్రదించండి.
రాజశేఖర్ గారివి వ్యక్తిగత వ్యాఖ్యలు.తన అభిప్రాయాన్ని వెలిబుచ్చే హక్కు ఆయనకుంది. అభిప్రాయాల్ని వెలిబుచ్చినందుకు ఆయన మీద, పసిపిల్లల మీద దాడి చేయడం అమానుషం.ఖండించాల్సిన అంశం.అదే సమయంలో రాజశేఖర్ కూడా ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది. అసలు చిరంజీవిగారు తనంతట తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేదు ఇంతవరకూ. ఆయన చెప్పకుండానే, వస్తాడో రాడో తెలియకుండానే, మనకి అభిప్రాయం వెలిబుచ్చే హక్కు ఉంది గదా అని, ఆయనకి రాజకీయానుభవం లేదని కామెంట్ చేసి వివాదాన్ని కొనితెచ్చుకోడం ఎందుకు ?
దాడి జరిగిందని తెలిసి చిరంజీవి రాజశేఖర్ ఇంటికెళ్ళి పరామర్శించి, క్షమాపణలు తెలియజేయడం చాల సంస్కారవంతంగా ఉంది.
కానీ ఆయన ఆ ప్రెస్ మీట్లో కొన్ని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. సంఘటనని బహిరంగంగా ఖండించదల్చుకుంటే ఆ పని ఎలాంటి శషభిషలు లేకుండా చేయాలి. "అభిమానులు మనస్తాపం చెంది ఉంటారు...హర్ట్ అయి ఉంటారు. కానీ వాళ్ళ ఆవేశం కంట్రోల్ చేసుకోవాలి".. ఏమిటీ సోది ?
రాజకీయాల్లోకి రావడానికి,అధికారం అందుకోడానికి రాజకీయానుభవం అనేది ప్రాతిపదిక కాదు.ఎన్.టి.రామారావ్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఈ విమర్శ వచ్చింది. దానికి సమాధానం జనమే తేల్చి చెప్పారు.ఎన్టీయార్ కయినా,రాజీవుడికయినా, సోనియాకయినా, చిరంజీవికయినా ఆ విమర్శ అక్షరాలా వర్తిస్తుంది. దానికి దురభిమానులు ఆవేశపడాల్సింది ఏంలేదు.రాజశేఖర్ మాట్లాడింది సత్యమే అంటూనే, దానికి అభిమనులు మనస్తాపం చెంది ఉంటారు అని ఈయనే చెప్పడం ఏంటి ? ఇప్పటిదాకా ఇదెవరో దురభిమానులు చేసింది అని అనుకుని ఖండించవచ్చు. చిరంజీవి ఇలా చెబ్తే, ఓహో మేము కూడా మనస్తాపం చెందాలి కాబోలు అని మామూలు అభిమానులు కూడా ఆవేశపడే ప్రమాదం ఉంది.రేపొద్దున్న ఇంకెవరన్నా ఏదన్నా అంటే మళ్ళీ ఇదే డ్రామా మొదలు.
నాగబాబు వచ్చి వాళ్ళు రిజిష్టర్డ్ ఫాన్స్ కాదు...అన్-రిజిష్టర్డ్ ఫాన్స్ అంటాడు. అదేదో కావాలని ఎవరో చేసినట్లుగా . దుండగులో, చిరంజీవికి చెడ్డపేరు తెచ్చే కుట్రో అయితే ముసుగులు వేస్కుని ఆ పని చేసేవాళ్ళు. ఇలా బహిరంగంగా, తమ కూడా వీడియో కెమెరాలు తెచ్చుకుని, దాడిని చిత్రీకరించి, మళ్ళీ ఆ క్యాసెట్ ని టివి ఛానెల్స్ కి పంపి ఉండేవాళ్ళు కాదు.
ఇహ వెంటనే పరామర్శల పర్వం మొదలయింది. ఆ సందట్లో అసలయిన సడేమియా మోహన్ బాబు గారిది. ఆయన గురువుగారికిమల్లే (దాసరి)ఈయన సగం శ్లేషతో,సగం వ్యంగ్యంతో, సగం మన కాల్పనిక,ఊహాశక్తికి వదిలేస్తూ మాట్లాడ్డం ! రాజశేఖర్ కూడా సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబిలీ సినిమాలు తీశాడు అంటాడు. ఇక్కడెవరూ పిరికివాళ్ళు లేరు, అసమర్ధులు లేరు అంటాడు. అసలు దానిగురించి ఇప్పుడెందుకు ? ఎవర్ని రెచ్చగొడ్తున్నాడో అర్ధం కాదు. ఎవరు చేయించారో ప్రజలకే తెలుసు అంటాడు. చిరంజీవి చేయించాడేమో అన్న అర్ధం రావాలనేమో ! ఇక అసలు పరామర్శకి వచ్చాను అనే విషయం వదిలేసి ఆయన మంచితనం గురించి,ఆయన కుటుంబం గురించి స్వోత్కర్ష ! రాజశేఖర్తో కలిపేసుకుని నేను చాలా మంచోడ్ని అని సొంతడబ్బా..ఏ సంఘటన జరిగినా, ఏ సందర్భంలో అయినా ఆవు మీద వ్యాసం రాసినట్లుగా మాట్లాడగల సమర్ధుడు మోహన్ బాబు !
ఈ కామెడీ ఇంకా కొనసాగబోతోంది! వేచి చూడండి !
Subscribe to:
Posts (Atom)