16వ తేదీన రైస్ వన్ రోల్ రెస్టారెంట్లో జరిగిన ఐదవ తెలుగువెన్నెల ఈసారి ఎక్కువమంది సాహితీ ప్రియుల్ని ఆకర్షించింది. కాలం గడిచేకొద్దీ సమావేశాలకి హాజరవుతున్న సాహితీ ప్రియుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.ముదావహం.
చంద్ర కన్నెగంటిగారు తెలుగు కథా సాహిత్యం మీద మాట్లాడ్డం ఈసారి ప్రత్యేకత. ఇంతకు మునుపు పద్యకవిత్వం ప్రధానంగా జరిగిన సమావేశాలు ఈసారి చంద్రగారి వల్ల ఆధునిక సాహిత్య ప్రక్రియ అయిన కథవేపు దృష్టి మరల్చాయి. పూర్తి ప్రసంగంలా కాకుండా కొంత చర్చాగోష్టిలా సాగడం కూడా ఈసారి కనబడింది. బహుశా చంద్ర "మనవూరివాడు" అవడం వల్ల,వేదిక సభ్యులకీ,వక్తకీ గతంలోకన్నా కొంత సామీప్యత "క్రియేట్" అయినట్లుగా నాకు అనిపించింది.మున్ముందు కూడా ఇదే స్ఫూర్తితో సమావేశాలు జరిగితే బాగుంటుందెమో.
ఇంకో విశేషం ఎక్కువమంది మహిళలు హాజరవ్వడం.క్రమం తప్పకుండా వచ్చే చిలుకూరి అన్నపూర్ణగారితో పాటు మంజులత కన్నెగంటి,డా శ్రీ దేవి,సుభాషిణి,వీణ,అన్నపూర్ణ నెహ్రూ..ఇలా చాలామంది మహిళా సాహితీప్రియులు రావడం నిజంగా సంతోషదాయకం.
రెండు నెలల గైర్హాజరీ తర్వాత ఆళ్ళ శ్రీనివాసుడు, పులిగండ్లవారూ కనిపించారు.సంతోషం !
భాస్కర్,మంజులత కన్నెగంటి గార్ల కవితా పఠనం, జువ్వాది రమణ గారి (సిరివెన్నెల సీతారామశాస్త్రి) గేయాలాపన బాగున్నాయి.
భాస్కర్,మంజులత కన్నెగంటి గార్ల కవితా పఠనం, జువ్వాది రమణ గారి (సిరివెన్నెల సీతారామశాస్త్రి) గేయాలాపన బాగున్నాయి.
ఈ సందర్భంగా మిత్రులందరికీ ఒక చిన్న సూచన. కేవలం కవితల్ని,గేయాల్ని, పద్యాల్ని చదవడం,పాడటమే కాకుండా వాటికి తగిన వ్యాఖ్యానం (స్వంతదయినా లేదా ఇతరులదయినా)జోడిస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుందేమో ఆలోచించండి.
మొత్తానికి సభ చక్కగా జరిగింది. కొసమెరుపుగా జాగ్స్ గారు చంద్రగారిని ప్రశంసిస్తూ పద్యమేదో చెప్పారు. జాగ్స్ గారూ ! ఆ పద్యమేదో ఇక్కడ పోస్ట్ చెయకూడదూ ?
కొత్త సంవత్సరంలో జరగబోయే ఆరవ సమావేశానికి మందపాటి సత్యంగారు ముఖ్య అతిధి అని ప్రకటించారు ఎంవీయెల్ ప్రసాద్ గారు. అయితే జనవరి నెలలో కూడా పసందయిన సాహితీవిందు ఉందన్నమాట !
No comments:
Post a Comment