Monday, December 24, 2007

కవులు కూడా కడపకేనా ?

కొద్దివారాలుగా చిన్న వివాదం నడుస్తున్నది.బమ్మెర పోతన తెలంగాణాలోని వరంగల్(ఏకశిలానగరం)కి చెందినవాడా, లెకుంటే కడప జిల్లాలోని ఒంటిమిట్టకి చెందినవాడా అని.
ఈ వివాదం ఇప్పటిది కాదు(ట).వందేళ్ళ క్రితమే మొదలయి,చల్లబడి,ప్రస్తుతం జరుగుతున్న కడప ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా తిరిగి రేగింది.

మంత్రి గల్లా అరుణకుమారి, కడప కలెక్టరు మీడియా ముఖంగా పోతన కడపజిల్లావాడే అని చెప్పినారుట.ఇహ ఇరువేపులా వాదప్రతివాదాలు మొదలయినాయి. తెలంగాణ రచయితల తరపున మొన్నీమధ్యే ఒక పత్రికాప్రకటన వెలువడింది.పోతన తెలంగాణావాడే అని.కాదు కాదంటూ అటువేపు నుండి నిరూపణలూ, సాక్ష్యాధార సమర్పణలూ పత్రికాముఖంగా జరుగుతున్నాయి.ఆసక్తి ఉన్నవాళ్ళు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వ్యాసాలు చూడండి.

ఈ పోస్ట్ కి లేబుల్ తగిలించేప్పుడు ఇది సాహిత్యమా..రాజకీయమా అనే మీమాంస వచ్చింది నాకు. ఇంకో కొత్త లేబుల్ పెట్టాలేమో. "రాజకీయసాహిత్యం" లేదా "సాహిత్యరాజకీయం" అని !
ప్రస్తుతానికి ఇది "కాలక్షేపం" గుంపుకి వెళ్తుంది అనుకుంటా !

No comments: