పేదలు లేని సమాజస్థాపనే నా ధ్యేయం-(చంద్రబాబు)-
అవునవును. మీ గత పాలనలో జరిగింది అదే.పేదరికాన్ని ఎలాగూ పోగొట్టలేం అని ఎరిగిన మీరు పేదల నిర్మూలన బాగా చేశారు అని మాకు తెలుసు.
ఎన్టీఆర్ వారసుడు వైయెస్సే- (పురంధ్రేశ్వరి)
-ఇదీ నిజమే.కాకుంటే చిన్న తేడా.అన్నగారు అనుకున్నది రామరాజ్యం. రాజావారు అనుకునేది ఇందిరమ్మ రాజ్యం.పనిలో పనిగా చిన్నమ్మాయి గారు "ఇందిరా తెలుగుదేశం" పార్టీని స్థాపించే ఆలోచన చేస్తే బాగుంటుంది అని ప్రజల విన్నపం.
గుజరాత్ తర్వాత మనమే-(వైయెస్)
-ఓహో పారిశ్రామికాభివృధ్ధిలోనా ? అణచివేతలో అనుకున్నాలెండి !
క్రైస్తవులకు అన్నివిధాల సహకరిస్తాం--(వైయెస్)
-క్రైస్తవులకా క్రైస్తవ పీఠాలకా అని చిన్న సందేహం
ఎసిబి కేసుల్లో వాస్తవం ఎంత ?-(జెసి దివాకర్ రెడ్డి)
-అవును సార్! అసలు ఒక పక్క మీ కారు డ్రైవర్లు, ఇంట్లో పాలేర్లు సిమెంట్ పరిశ్రమలు స్థాపించే స్థాయిలో ఎదుగుతుంటే, ఏదో రెండు లంచం రాళ్ళు తీస్కున్నంత మాత్రాన బక్క ఉద్యోగుల మీద ఎసిబి కేసులు పెట్టెయడమేనా ? మినిమం 100 కోట్లన్నా వెనకేస్కున్నాక ఎసిబి "వాస్తవం"గా కేసులు పెట్టాలని కోరుతున్నాం సార్ !
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment