మొన్నటి శనివారం సాయంత్రం పసంద్ రెస్టారెంట్లో డల్లాస్ తెలుగు సాహితీప్రియులంతా ప్రముఖ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తితో కలిసి 3 గంటలపాటు ముచ్చటించడం జరిగింది. ప్రముఖ వైద్యులు,సాహితీప్రియులయిన ఆళ్ళ శ్రీనివాస రెడ్డిగారు ఏర్పాటు చేసిన ఈ విందులో డల్లాస్ తెలుగు సాహిత్య వేదిక సభ్యులయిన సాహిత్యాభిమానులు చాలమంది కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఎక్కువ వ్యవధి లేకుండానే విందు నిర్ణయం జరిగినప్పటికీ చంద్రగారు, ఎంవీయెల్ ప్రసాద్ గారు చకచకా ఫోన్లు కలిపి అందరికీ వార్త చేరవేయడం, మిత్రులంతా మల్లాదిగారితో ముచ్చటించడానికి రావడం జరిగింది.
సతీసమేతంగా విందులో పాల్గొన్న మల్లాదిగారు తన నవలల్లో తనకు నచ్చినవి,ఇతరుల నవలల్లో తనకు నచ్చినవి, అవి నచ్చడానికిగల కారణాలు వంటి అంశాలపైన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కొద్దిసేపు సంభాషణ ఆయన రాసిన చందమామ కథలవేపుకి మళ్ళింది. చందమామ కథలు అనగానే మిత్రులు చాలామంది తమ బాల్యజ్ఞాపకాల్లో కొద్దిసేపు విహరించారనుకుంటా. TV కార్యక్రమాలపట్ల మొహం మొత్తిన తెలుగుప్రజలు మళ్ళీ పుస్తకం బాట పడ్తున్నట్లుగా ఈ మధ్య కనిపిస్తుంది అని ఆయన చెబుతుంటే సంతోషంగా అనిపించింది.తెలుగు వాడకం,నవలలు,ఇతర తెలుగు పుస్తకాలు చదవడం ఎందుకు తగ్గిపోతున్నది,సమస్య పరిష్కారానికి ఏం చేయాలి అనే అంశం కూడా బాగానే చర్చించబడింది.
మల్లాదిగారికి ఒక చిన్న పట్టింపు ఉంది.ఆయన ఫోటో ని ఇంతవరకు ఎక్కడా ప్రచురించలేదు. అదాయనకు ఇష్టం ఉండదు. దానివల్ల కొంత స్వేచ్చని కోల్పోవలసివస్తుంది అని ఆయన అభిప్రాయం. సమకాలీన ప్రముఖరచయితల్లో "ఎలా ఉంటారో" తెలియని అతికొద్దిమందిలో ఆయనొకడు.ఇప్పటిదాకా చాలాసార్లు ఆయన పుస్తకాలు చదివి ఆందించాం.ఇప్పుడు ఆయన్ని కలుసుకుని సరదాగ పిచ్చాపాటీ మాట్లాడుకుని చక్కటి విందుభోజనం చేశాం.ఆళ్ళ శ్రీనివాసుడికి మా అందరితరపునా ధన్యవాదాలు.
Monday, January 14, 2008
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
kc garu mi program chala adhbutham ga undhi.miru matlade telugu chala spashtam ga undhi.baga enjoy chesthunnamu.
thank u very much
kalyani.
కళ్యాణి గారూ,
మీకు నా రేడియో కార్యక్రమం నచ్చినందుకు ధన్యవాదాలు !
Post a Comment